గంగవరం అదానీలదే

ABN , First Publish Date - 2021-04-14T06:24:59+05:30 IST

అదానీ గ్రూపు గంగవరం పోర్టు టేకోవర్‌కు కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీ ఐ) ఆమోదం లఽభించింది. అదానీ అనుబంధ ఏపీఎ్‌సఈజడ్‌ గత నెల గంగవరం పోర్టు ప్రమోటర్‌ డీవీఎస్‌ రాజు

గంగవరం అదానీలదే

విశాఖపట్టణం (ఆంధ్రజ్యోతి): అదానీ గ్రూపు గంగవరం పోర్టు టేకోవర్‌కు కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీ ఐ) ఆమోదం లభించింది. అదానీ అనుబంధ ఏపీఎ్‌సఈజడ్‌ గత నెల గంగవరం పోర్టు ప్రమోటర్‌ డీవీఎస్‌ రాజు, అయన కుటుంబ సభ్యుల నుంచి 58.1 శాతం, పీఈ ఇన్వెస్టర్‌ వార్‌బర్గ్‌ పింకస్‌ నుంచి 31.5 శాతం వాటా కొనుగోలు చేసింది. దీంతో గంగవరం పోర్టు ఈక్విటీలో 89.6 శాతం అదానీ గ్రూపు పరమైంది. దీంతో రాష్ట్రప్రభుత్వ వాటా 10.4 శాతం మినహా మిగతా అంతా అదానీల చేతికి వచ్చినట్టే అయింది. 

Updated Date - 2021-04-14T06:24:59+05:30 IST