వినూత్న రీతిలో గంగపుత్రుల నిరసన

ABN , First Publish Date - 2022-08-15T05:59:45+05:30 IST

హెటెరో ఔషధ పరిశ్రమకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆదివారం నడుముకు మామిడి కొమ్మలు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు.

వినూత్న రీతిలో గంగపుత్రుల నిరసన
వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్న మత్స్యకారులు

నక్కపల్లి, ఆగస్టు 14: హెటెరో ఔషధ పరిశ్రమకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆదివారం నడుముకు మామిడి కొమ్మలు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈ ప్రాంత మత్స్యకారులు చేస్తున్న మహా శాంతియుత ధర్నా ఆదివారం నాటికి 257వ రోజుకు చేరింది. వీరికి ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల నాయకులు వాసిపిల్లి నూకరాజు, గోసల స్వామి, పిక్కి సత్తిరాజు, వాసుపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-15T05:59:45+05:30 IST