Supreme Court: కన్వర్ యాత్రను రద్దు చేయండి

ABN , First Publish Date - 2021-07-16T17:56:23+05:30 IST

కోవిడ్-19 నేపథ్యంలో కన్వర్ యాత్రను రద్దు చేయాలని యూపీతో పలు రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకురావడాన్ని

Supreme Court: కన్వర్ యాత్రను రద్దు చేయండి

న్యూఢిల్లీ: కోవిడ్-19 నేపథ్యంలో కన్వర్ యాత్రను రద్దు చేయాలని యూపీతో పలు రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకురావడాన్ని అనుమతించొద్దని ఆదేశాల్లో పేర్కొంది. నిర్దేశిత ప్రాంతాల్లో శివాభిషేకాలకు గంగాజలాన్ని ట్యాంకర్ల ద్వారా ఏర్పాటు చేయాలని సూచించింది. జీవించే హక్కు కంటే మత విశ్వాసాలేమీ ముఖ్యం కాదని కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కరోనా థర్డ్ వేవ్ ఆందోళనల నేపథ్యంలో కన్వర్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. 


ఇదిలా ఉంటే, కన్వర్ యాత్రపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ సందర్భంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. హరిద్వార్ నుంచి గంగాజలం తీసుకురావడానికి కన్వరియాలకు అనుమతి ఇవ్వొద్దని రాష్ట్రాలకు సూచించినట్టు కేంద్రం తెలిపింది. అయితే మతవిశ్వాసాలను అనుసరించి ట్యాంకర్ల ద్వారా గంగాజలం అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు పేర్కొంది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆ నీటినే సమీపంలో శివాలయాల్లో అభిషేకానికి వినియోగించుకోవలసిందిగా సూచించామని తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గంగాజలం పంపిణీ చేసుకోవలసిందిగా భక్తులకు సూచించినట్టు సుప్రీం కోర్టుకు తెలిపింది. 

Updated Date - 2021-07-16T17:56:23+05:30 IST