Jubileehills బాలిక కేసు.. ఐదుగురు మైనర్ల మధ్య వాగ్వాదం.. Saduddin కస్టడీ రిపోర్ట్లో సంచలన విషయాలు
ABN , First Publish Date - 2022-06-13T19:50:43+05:30 IST
జువైనల్ హోంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఐదుగురు మైనర్ల మధ్య వాగ్వాదం జరిగింది.
Hyderabad: జూబ్లీహిల్స్ బాలికపై గ్యాంగ్ రేప్ (Gang rape) కేసుకు సంబంధించి జువైనల్ హోం (Juvenile Home)లో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఐదుగురు మైనర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిస్థితికి నువ్వంటే నువ్వే కారణమంటూ పరస్పర దూషణలు చేసుకున్నారు. మమ్మల్ని పబ్బుకు తీసుకెళ్లడం వల్లే వచ్చామంటూ.. ఓ మైనర్ని మరో ఇద్దరు మైనర్లు దూషించారు. అయితే బాలికను ట్రాప్ చేద్దామని సలహా ఇచ్చింది మీరేనంటూ.. మరో ఇద్దరిని మైనర్ బాలుడు దూషించాడు. దీంతో పోలీసులు మైనర్లకు సర్ది చెప్పారు. కాగా పోలీసుల విచారణలోనూ మైనర్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. సాదుద్దీన్ రెచ్చగొట్టడంవల్లే అత్యాచారం చేశామంటూ మైనర్లు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. సాదుద్దీన్ మాత్రం ముందుగా ఎమ్మెల్యే కొడుకే బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు స్టేట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఐదుగురు మైనర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
కాగా బాలికపై గ్యాంగ్రేప్ కేసుకు సంబంధించి నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడీ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాస్త్రీపురం కార్పొరేటర్ కుమారుడే అసలు సూత్రధారి అని చెప్పాడు. పబ్లోకి రాగానే కార్పొరేటర్ కుమారుడు, ఎమ్మెల్యే కొడుకు.. ఇద్దరూ కలిసి అమ్మాయిలను వెతకడం ప్రారంభించారని, మైనర్లను వేధించారని చెప్పాడు. కార్పొరేటర్ కొడుకు, ఎమ్మెల్యే కొడుకు బాధితురాలి వెంటపడ్డారని, తాను వద్దని వారించినా వినలేదని తెలిపాడు. ఎమ్మెల్యే కొడుకు బాలికను బెంజ్ కారులో ఎక్కించుకున్నాడని, ఆమె కారులో ఎక్కగానే బాలికను వేధించాడని సాదుద్దీన్ మాలిక్ కస్టడీ రిపోర్ట్లో వివరాలు వెల్లడించాడు.