నకిలీ కరోనా ఇంజెక్షన్ల తయారీ.. ఐదుగురి ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2020-07-22T03:40:29+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజారత్ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది.

నకిలీ కరోనా ఇంజెక్షన్ల తయారీ.. ఐదుగురి ముఠా అరెస్టు

సూరత్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజారత్ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవడానికి కొందరు నీచులు ప్రయత్నిస్తున్నారు. కరోనా సోకి విషమ పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు ఉపయోగించే ఓ ఇంజెక్షన్ గురించి తెలుసుకున్న కొందరు.. ఈ సమాచారాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా అదే పేరుతో నకిలీ ఇంజెక్షన్లు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. ఇదంతా గుజరాత్‌లో జరిగింది. ఈ ముఠాలోని మొత్తం ఐదుగురు సభ్యులను సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. పుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఓ నకిలీ ఫార్మా కంపెనీపై చేసిన రైడ్‌లో ఈ ముఠా చేస్తున్న పని బయటపడింది.

Updated Date - 2020-07-22T03:40:29+05:30 IST