ఇద్దరు యువకులపై గ్యాంగ్ దాడి
ABN , First Publish Date - 2020-06-07T14:29:31+05:30 IST
కొందరు గ్యాంగ్గా వచ్చి ఇద్దరు యువకులపై దాడి చేశారు.
హైదరాబాద్/జీడిమెట్ల : జీడిమెట్ల ఎస్ఆర్నాయక్ నగర్లో శుక్రవారం రాత్రి కొందరు గ్యాంగ్గా వచ్చి ఇద్దరు యువకులపై దాడి చేశారు. బాధితులు కాపాడాలని వేడుకుంటూ.. ప్రాణభయంతో పరుగులు తీశారు. జీడిమెట్ల సాయిబాబానగర్ పాండుబస్తీకి చెందిన హరీష్, సుభా్షనగర్కు చెందిన రాహుల్ స్నేహితులు. వీరు శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఎస్ఆర్నాయక్ నగర్ పార్కు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు.
ఈ క్రమంలో సాయిబాబానగర్కు చెందిన రాజు, శ్రావణ్ తమ గ్యాంగ్తో వచ్చి రాహుల్, హరీ్షలను దూషిస్తూ తీవ్రంగా కొట్టారు. బాధితులు ప్రాణభయంతో పరుగులు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై శనివారం కేసు నమోదు చేశారు. ఈ దాడి వెనుక రాజకీయ హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటన విజయవాడలో జరిగిన గ్యాంగ్వార్ను తలపించిందని స్థానికులు అంటున్నారు.