కార్లను తాకట్టు పెడుతున్న ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2021-07-17T03:34:01+05:30 IST
కార్లు అద్దెకు తీసుకొని తాకట్టు పెడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు
గుంటూరు: కార్లు అద్దెకు తీసుకొని తాకట్టు పెడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అర్బన్ ఎస్పీ హఫీజ్ తెలిపారు. నిందితులు వెంకట నరసింహారావు, కొమిరిశెట్టి సాంబశివరావు, రిషిపై పలు పీఎస్లలో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. రిషి పరారీలో ఉన్నాడని ఎస్పీ హఫీజ్ తెలిపారు. నిందితుల నుంచి కోటి 18 లక్షల విలువైన 21 కార్లు స్వాధీనం చేసుకున్నామని హఫీజ్ పేర్కొన్నారు.