TS news: నల్గొండలో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-09T17:23:29+05:30 IST

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది.

TS news: నల్గొండలో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన (Ganesh immersion) శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. నల్గొండ హనుమాన్ నగర్‌లోని ఒకటో నంబర్ వినాయకుడి వద్ద  మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish reddy) ప్రత్యేక పూజలు నిర్వహించి శోభా యాత్ర (Shobha yatra)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 15 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. నల్గొండలోని అన్ని గణేష్ విగ్రహాలు క్లాక్ టవర్ మీదుగా  గణేష్ శోభయాత్ర సాగనుంది. 10 - 20 అడుగుల పెద్ద విగ్రహాలు దండంపల్లి కాలువ వద్ద, 10 అడుగుల విగ్రహాలు వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సూర్యాపేటలో మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-09-09T17:23:29+05:30 IST