TS News: గణేష్ ఉత్సవాలపై అధికారులతో మంత్రి తలసాని సమావేశం
ABN , First Publish Date - 2022-08-30T20:04:08+05:30 IST
గణేష్ ఉత్సవాలపై బుద్ధ భవన్లో జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి తలసాని సమావేశం అయ్యారు.
హైదరాబాద్ (Hyderabad): గణేష్ (Ganesh) ఉత్సవాలపై బుద్ధ భవన్లో జీహెచ్ఎంసీ (GHMC) అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపినట్లు చెప్పారు. మట్టి విగ్రహాల (Clay idols)ను ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్లో 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతోందన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఉత్సవాల నిర్వహకులు కూడా అధికారులకు సహకరించాలని మంత్రి తలసాని సూచించారు.