వినాయక చవితి వేళ.. ఉండ్రాళ్లు ఎవరు ఎలా చేస్తారు?
ABN , First Publish Date - 2022-08-30T00:57:40+05:30 IST
వినాయక చవితితో దేశంలో పండుగ సీజన్ ప్రారంభం అవుతుంది. కరోనా మహమ్మారి రెండేళ్లపాటు వేడుకలను
హైదరాబాద్: వినాయక చవితితో దేశంలో పండుగ సీజన్ ప్రారంభం అవుతుంది. కరోనా మహమ్మారి రెండేళ్లపాటు వేడుకలను అడ్డుకున్న నేపథ్యంలో ఈసారి వేడుకలు అట్టహాసంగా ఉండనున్నాయి. ఇంట్లోనే కాదు, సామూహికంగానూ జరుపుకునే ఈ పండుగ జరుపుకునే 9 రోజులు ప్రజలు భక్తిశ్రద్ధలతో గణనాథుడిని కొలుస్తారు. దీంతో గణేశ్ మండపాలు ఈ 9 రోజులు శోభాయమానంగా వెలుగులీనుతూ ఉంటాయి. భారతీయ పండుగ ఏదైనా పసందైన విందు, తియ్యందనాలు ఉండాల్సిందే. గణేశ్ చవితి వేళ అది మరింత ముఖ్యం.
విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటి నుంచి నిమజ్జనం వరకు ప్రతి రోజూ నైవేద్యాలు సమర్పిస్తారు. హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ గణేష్తో దశాబ్దాల అనుబంధం ఉంది. తెలంగాణాలో అత్యంత ప్రాచుర్యం పొందిన గణేశ మండపం ఇది. 2019లో ఖైరతాబాద్ గణేశ విగ్రహాన్ని 60 అడుగుల ఎత్తులో రూపొందించారు. దేశంలోనే అతి ఎత్తైన గణేశ్ విగ్రహంగా ఇది రికార్డులకెక్కింది. వినాయక చవితి వేళ ఇంటిలో జరుపుకునే పూజలతో పాటుగా కమ్యూనిటీలో పూజ జరుపుకోవడమూ ఎక్కువగా కనిపిస్తుంది.
వినాయక చవితి పండుగ విశిష్ఠతపై గోల్డ్డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ.. బాల గణేశుడి కథతోపాటు మోదక్ (కుడుములు) పట్ల ఆయన అభిరుచి గురించి ప్రతి ఇంటిలోనూ, ప్రతి సంవత్సరం కథల రూపంలో చెబుతూనే ఉంటారని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ లీలా విశేషాలు మనకు ఆసక్తిగానే ఉంటాయన్నారు. ఈ కుడుములకు విభిన్న పేర్లు ఉన్నట్లుగానే విభిన్న రకాలుగా తయారుచేసినప్పటికీ, కొబ్బరి, బెల్లంతో తయారుచేసిన కుడుములను ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు.
బయట రవ్వ కోటింగ్ ఇచ్చి కొంకణ్లో ములిక్గా చేయడంతో పాటుగా సంప్రదాయ ఉండ్రాళ్లలా అరటిపళ్లతో చేస్తే, కేరళలో మినప్పప్పు, స్పైసెస్తో సాల్టీ స్టీమ్డ్ వెర్షన్గా ఉప్పు కొజుకత్తైగా తీర్చిదిద్దుతారు. తెలంగాణాలో ఉండ్రాళ్లు, చలివిడి, వడపప్పు వంటి రకాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. షాప్లలో ప్రతి సంవత్సరం ఈ ఉండ్రాళ్లలో విభిన్న వెర్షన్స్ కనిపిస్తుంటాయి. వీటితో పాటుగా బాదములు, జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా అందించడం కనిపిస్తుంది. ఈ సంవత్సరం తెలంగాణాలో అత్యంత ఆశ్చర్యకరమైన మోదక్స్ను వీక్షించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ తెలిపారు.