అప్రమత్తంగా ఉండాలి: జడ్పీ చైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2021-05-08T04:58:16+05:30 IST

అప్రమత్తంగా ఉండాలి: జడ్పీ చైర్‌పర్సన్‌

అప్రమత్తంగా ఉండాలి: జడ్పీ చైర్‌పర్సన్‌
వ్యాక్సిన్‌ తీసుకుంటున్న గండ్ర జ్యోతి

శాయంపేట, మే 7 : కరోనాతో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నివారణ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అనంతరం డాక్టర్‌ నాగశశికాంత్‌తోపాటు వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ ఒక్కరు మాస్క్‌ ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. అంతకుముందు నర్సింహులపల్లికి చెందిన మిరిపెల్లి కుమారస్వామి ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా, పార్టీ సభ్యత్వం తీసుకోగా రూ. 2లక్షల ప్రమాద బీమా చెక్కును మృతుడి భార్య విజయకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కందగట్ల రవి, అబ్బు ప్రకాశ్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ దైనంపల్లి సుమన్‌, మండల పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్‌ రెడ్డి, నాయకులు భాస్కర్‌, నందం, కరన్‌బాబు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-08T04:58:16+05:30 IST