ఆలయాల అభివృద్ధికి పెద్దపీట
ABN , First Publish Date - 2021-04-17T05:40:41+05:30 IST
ఆలయాల అభివృద్ధికి పెద్దపీట
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి టౌన్, ఏప్రిల్ 16 : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీచే ఆయన ప్రమాణస్వీకారం చేపించారు. అంతకుముందు భూపాలపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాలు ప్రజల మానసిక ఆందోళనను తగ్గించేందుకు ఉపకరిస్తాయని అన్నారు. మనిషిలోని మానవత్వాన్ని ఆధ్యాత్మికం పెంపొందిస్తుందన్నారు. అందుకే ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని అన్నారు. నూతన కమిటీ బాధ్యతయుతంగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీభక్తాంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం కుమార్రెడ్డి, డైరెక్టర్లుగా జి.రాజు, డి.వెంకటలక్ష్మి, జి.శ్రీనివాస్, ఎన్.భరత్కుమార్, పి.రమేష్, జి.శ్యాంకుమార్ ఎన్నికకాగా ఆలయ పూజారిగా డింగిరి మురళీకృష్ణ ప్రమాణస్వీకారం చేశారు.