భక్తిశ్రద్ధలతో గంధమహోత్సవం

ABN , First Publish Date - 2021-03-01T06:47:00+05:30 IST

పామూరు మేజర్‌ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో వెలిసిన ‘హజరత్‌ సయ్యద్‌ కరీముల్లాషా హాజీ ఉరఫ్‌ కాలేషాపీర్‌ మస్తాన్‌వలి రహంతుల్లా అల్లాహీ’ 55వ గంధమహోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.

భక్తిశ్రద్ధలతో గంధమహోత్సవం
పూలతో అలంకరించిన దర్గా

పామూరు, ఫిబ్రవరి 28: పామూరు మేజర్‌ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో వెలిసిన ‘హజరత్‌ సయ్యద్‌ కరీముల్లాషా హాజీ ఉరఫ్‌ కాలేషాపీర్‌ మస్తాన్‌వలి రహంతుల్లా అల్లాహీ’ 55వ గంధమహోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ గంధమహోత్సవం సందర్భంగా స్వామి వారి దర్గాను రంగురంగుల విద్యుత్‌దీపాలతో, పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కులమతాలకు అతీతంగా జరిగే గంధమహోత్సవ వేడుకలకు హిందూ ముస్లిం భక్తులు పాల్గొని స్వామి వారికి నైవేద్యం సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సోమవారం 1వ తేదీన రాత్రి 10 గంటలకు దీపారాధన, 2న మంగళవారం తహలీల్‌ పాతేహా మరియు భక్తులు గంధం, తాంబూలం పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2021-03-01T06:47:00+05:30 IST