ప్రపంచానికి మార్గదర్శకుడు గాంధీజీ
ABN , First Publish Date - 2022-10-03T05:54:52+05:30 IST
అహింసామార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన గాంధీ మహాత్ముడు ప్రపంచానికి మార్గదర్శకుడని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, హైకోర్డు జడ్జి పి.మాధవిదేవి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మండలంలోని పెద్దకాపర్తి శివారులో గాంధీ గుడి లో ఆదివారం నిర్వహించిన పూజల్లో పాల్గొని మాట్లాడారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
చిట్యాలరూరల్, అక్టోబరు 2: అహింసామార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన గాంధీ మహాత్ముడు ప్రపంచానికి మార్గదర్శకుడని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, హైకోర్డు జడ్జి పి.మాధవిదేవి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మండలంలోని పెద్దకాపర్తి శివారులో గాంధీ గుడి లో ఆదివారం నిర్వహించిన పూజల్లో పాల్గొని మాట్లాడారు. హింసా మార్గంలో వెళ్తున్న నేటి సమాజంలో అందరూ గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తే సమస్యలు దూరమవుతాయన్నారు. గాంధీని మహాత్ముడిగా కొలవడమేగాక ఆయనపై అభిమానంతో మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడిని నిర్మించడం, ఇక్కడ నిత్యం పూజలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలకు ఈ అవకాశాన్ని కల్పించిన సంస్థ ట్రస్టీ మోర శ్రీపాల్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు మోర భూపాల్రెడ్డి, ట్రస్ట్ కార్యదర్శి పారుపల్లి వెంకటకృష్ణారావు, డా. సీతతో పాటు సభ్యులందరినీ అభినందించాల్సిన విషయమన్నారు. అనంతరం మహిళలకు పండ్లను హైకోర్డు జడ్జి మాధవిదేవి పంపిణీ చేశారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎఫ్ఐసీసీ ఐ చైర్పర్సన్ మహేశ్వరి, ఏపీ మాజీ మంత్రి పి.నారాయణ, గాం ధీగుడి సలహాదారుడు జోగినపల్లి శ్రీనివాసరావు, ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ఎ.సత్యనారాయణరెడ్డి, ఎన్సీసీ డైరెక్టర్ ఏవీఎన్.రాజు, సర్పంచ్ మర్రి జలంధర్రెడ్డి, ఉపసర్పంచ్ నూతి సత్యశ్రీవెంకటేశం, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, తేరటుపల్లి హనుమంతు, వాసా విద్యాసాగర్, కలకుంట్ల రవి, వనమా ప్రవీణ్, జిట్ట నరేష్ తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం అతిథులకు పురోహితులు ఆశీర్వచనం చేయగా, ట్రస్టు సభ్యులు జ్ఞాపికలు, గాంధీ చరిత్ర పుస్తకాలను అందజేశారు.