గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-10-03T05:08:26+05:30 IST

పలమనేరు పట్టణంలో ఆదివారం మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. పలమనేరు టీడీపీ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి మాజీ మంత్రి అమరనాథరెడ్డి పూలమాలవేసి నివాళి అర్పించారు.

గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం నిర్వీర్యం
పలమనేరు టీడీపీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రి అమర్‌, టీడీపీ క్యాడర్‌

మాజీ మంత్రి అమరనాథరెడ్డి


పలమనేరు, అక్టోబరు 2: పట్టణంలో ఆదివారం మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. పలమనేరు టీడీపీ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి మాజీ మంత్రి  అమరనాథరెడ్డి పూలమాలవేసి నివాళి అర్పించారు.  లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశానికి  చేసిన సేవలు  కొనియాడారు.  గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం కోసం భారత రాజ్యాంగం పంచాయతీ వ్యవస్థను రూపొందిస్తే వైసీపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం దుశ్చర్యలకు చరమగీతం పాడాలని కోరుతూ అందుకు నిరసనగా టీడీపీ సర్పంచ్‌లు గాంధీ చిత్రపటానికి 11 డిమాండ్లతో వినత పత్రాన్ని సమర్పించారు.  ఆర్బీసీకుట్టి, బ్రహ్మయ్య, సుబ్రమణ్యంగౌడు, చాంద్‌భాషా, ఖాజాపీర్‌, మదన్‌మోహన్‌,   పలమనేరు  మండల టీడీపీ అధ్యక్షుడు నాగరాజరెడ్డి, గంగవరం మండల నాయకులు ప్రసాద్‌నాయుడు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-03T05:08:26+05:30 IST