గాంధీలో అఖిలప్రియకు వైద్య పరీక్షలు పూర్తి

ABN , First Publish Date - 2021-01-14T19:47:20+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి.

గాంధీలో అఖిలప్రియకు వైద్య పరీక్షలు పూర్తి

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు గాంధీ ఆసుపత్రిలో  వైద్య  పరీక్షలు పూర్తి అయ్యాయి. ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే రే, గైనకాలజి, న్యూరాలజీ డిపార్టమెంట్‌లో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో మారేడ్‌పల్లి న్యాయమూర్తి నివాసంలో అఖిలప్రియను పోలీసులు హాజరుపర్చనున్నారు. అనంతరం చంచల్ గూడ మహిళ జైలుకు తరలిస్తారు. అంతకుముందు ఉదయం అఖిల ప్రియకు బేగంపేట్ పాటిగడ్డ హెల్త్ కేర్ సెంటర్‌లో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు నెగెటివ్‌గా తేలింది. 

Updated Date - 2021-01-14T19:47:20+05:30 IST