ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
ABN , First Publish Date - 2022-08-20T06:38:11+05:30 IST
ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
గన్నవరం, ఆగస్టు 19 : పాత గన్నవరంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో నాల్గువ శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. 108 మంది మహిళలచే అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని మానుకు భక్తులు పూజలు చేశారు. పొంగళ్లు సమర్పించారు. శ్రీలక్ష్మీ సహస్రనామ పారాయణం జరిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు జాస్తి శ్రీధర్రావు, ఉపాధ్యక్షుడు గొట్టు ముక్కల విష్ణు, చిమట శ్రీనివాసరావు, పొట్ట శివలీల, మోదుగుమూడి వేణు, నర్రా గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.