క్రీడల నిర్వహణ అభినందనీయం

ABN , First Publish Date - 2020-11-29T05:27:08+05:30 IST

క్రీడల నిర్వహణ అభినందనీయం

క్రీడల నిర్వహణ అభినందనీయం
జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభించిన సర్పంచ్‌ సౌమ్యారెడ్డి

కులకచర్ల సర్పంచ్‌ సౌమ్యారెడ్డి


కులకచర్ల: దేశ రక్షణకోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం యువకులు క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయమని కులకచర్ల సర్పంచ్‌  సౌమ్యారెడ్డి అన్నారు.  అవిల్దార్‌ ప్రవీన్‌, సిఫాయి మహేశ్వర్‌ స్మారకార్ధం శనివారం కులకచర్ల గ్రామయువకులు నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలన్నారు. యువత నిర్వహించే కార్యక్రమాలకు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైస్‌మిల్లు అసోషియన్‌ ప్రధాన కార్యదర్శి జి.శ్రీధర్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు మైపాల్‌, క్రీడల నిర్వాహకులు నర్సింహులు, రమేశ్‌, అరవింద్‌, మైపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:27:08+05:30 IST