ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుంది

ABN , First Publish Date - 2021-04-23T06:02:33+05:30 IST

ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుంది

ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుంది
ఉపాధ్యాయులకు బియ్యాన్ని అందజేస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి 

భూపాలపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 22 : రాష్ట్రప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం భూపాలపల్లి పట్టణంలోని రెడ్డికాలనీలో గల రేషన్‌ దుకాణంలో మండలంలోని ప్రైవేటు బోధన, బోధనేతర సిబ్బందికి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ వారిని ఆదుకునేందుకు రూ.2వేలు నగదు, 25కిలోల బియ్యాన్ని పంపిణీ చేసే నిర్ణయాన్ని తీసుకుని అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని, ఎవరూ అఽధైర్యపడవద్దని అన్నారు. అర్హులైన వారందరికీ ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో అబ్ధుల్‌హై, సెక్టోరియల్‌ అధికారి హరికృష్ణ, ఏడీఈ రాజేందర్‌, ఎంఈవో దేవానాయక్‌, ఉపాధ్యాయులు కృష్ణమోహన్‌, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు నాగుల దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T06:02:33+05:30 IST