మాస్కులు దొరక్కపోతే ‘గమ్చా’ వాడండి
ABN , First Publish Date - 2020-03-29T08:34:50+05:30 IST
మాస్కుల కొరత కారణంగా ‘గమ్చా’ (భారతీయ సంప్రదాయ టవెల్)ను వాడాలని ప్రజలకు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్దేవ్ సలహా ఇచ్చారు. ‘ఆస్పత్రులు, క్వారంటైన్లో...
ప్రజలకు త్రిపుర సీఎం సలహా
అగర్తల, మార్చి 28 : మాస్కుల కొరత కారణంగా ‘గమ్చా’ (భారతీయ సంప్రదాయ టవెల్)ను వాడాలని ప్రజలకు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్దేవ్ సలహా ఇచ్చారు. ‘ఆస్పత్రులు, క్వారంటైన్లో ఉన్నవారికి మాస్కులు తప్పనిసరి. ఈ తరుణంలో అందరికీ మాస్కులు పంపిణీ చేయడం సాధ్యం కాదు. కాబట్టి మాస్కులు దొరకని వారు గమ్చా వాడండి’ అని దేవ్ సూచించారు.