Chittoor: గల్లా కుటుంబంపై భూ ఆక్రమణ కేసు నమోదు
ABN , First Publish Date - 2021-09-30T17:26:34+05:30 IST
గల్లా కుటుంబంపై భూ ఆక్రమణ కేసు నమోదు అయ్యింది. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్తో పాటు గల్లా రామచంద్రనాయడుతో సహా 12 మందిపై కేసు నమోదు అయ్యింది.
చిత్తూరు: గల్లా కుటుంబంపై భూ ఆక్రమణ కేసు నమోదు అయ్యింది. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్తో పాటు గల్లా రామచంద్రనాయుడుతో సహా 12 మందిపై కేసు నమోదు అయ్యింది. తవణంపల్లి మండలం దిగువమాగం గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి కోర్టులో ప్రైవేటు కేసు వేయడంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. దిగువ భాగానికి చెందిన రైతు గోపి కృష్ణకు చెందిన పొలాన్ని గల్లా కుటుంబం రాజన్న ట్రస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో భూ ఆక్రమణలకు పాల్పడిందంటూ రైతు కోర్టులో కేసు వేశాడు. దీనిపై విచారణ జరిపిన చిత్తూరు నాలుగో అదనపు కోర్టు వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.