టీజీ వెంకటేష్ ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం

ABN , First Publish Date - 2021-07-26T22:46:10+05:30 IST

టీజీ వెంకటేష్ ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం

టీజీ వెంకటేష్ ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం

ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టులో 960 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ కేంద్ర నిర్మాణం జరుగుతోందన్నారు. విద్యుత్ నిర్మాణ పనుల్లో 108 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్‌వర్క్ ఇప్పటికే 98 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తియినట్లు తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. 80 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 12 యూనిట్లతో విద్యుత్ కేంద్ర నిర్మాణం జరుతున్నట్లు ఏపీ ప్రభుత్వం చెప్పిందని రాజ్యసభకు కేంద్రం చెప్పిందన్నారు. జులై 2024 వరకు మూడు యూనిట్ల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. అలాగే 9 యూనిట్ల నిర్మాణం 2026 జనవరికి అందుబాటులోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం తెలిపిందని వెల్లడించారు.

Updated Date - 2021-07-26T22:46:10+05:30 IST