పట్టణ ప్రగతిపై శ్రద్ధ చూపండి
ABN , First Publish Date - 2021-06-24T05:01:13+05:30 IST
gadwal collector visited development works
- కలెక్టర్ శ్రుతి ఓఝా
- మునిసిపల్ కమిషనర్లతో సమీక్ష
గద్వాల, జూన్ 23 (ఆంధ్రజ్యోతి) : పట్టణ ప్రగతిపై శ్రద్ధ చూపాలని, మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రుతి ఓఝా కమిషనర్లను అదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. సీసీ రోడ్లు పనులను సకాలంలో పూర్తి చేయాలని, మురికి కాల్వలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 13, 14, 15 ఫైనాన్స్ నిధులను వెంటనే ఖర్చు చేయాలని చెప్పారు. శ్మశాన వాటికల వద్ద బర్నింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. వైకుంఠధామాల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్లు, మిషన్ భగీరథ పైపు లైన్ల పనులను పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల రెండోవారం నాటికి అన్ని పనులు పూర్తి కావాలని ఆదేశించారు. పట్టణ ప్రగతి నిధులు ఉన్నా పనులు పూర్తి చేయడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్షతో పాటు మునిసిపాలిటీ కమిషనర్లు పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం గద్వాల మునిసిపాలిటీలో వైకుంఠధామం, తడిపొడి చెత్త షెడ్లను, ఇతర అభివృద్ధి పనులను కలెక్టర్ పరీశీలించారు. అనంతరం కమిషనర్లతో సమీక్ష నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు.