బీజేపీలో హాట్టాపిక్గా గడ్కరీ వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-04-30T22:05:41+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో హాట్టాపిక్గా మారాయి. రాష్ట్రంలో పలు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలను శుక్రవారం కేందమంత్రి చేశారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్తో హైదరాబాద్ దాహార్తి తీరిందన్నారు. అయితే గడ్కరీ వ్యాఖ్యలు సోషల్మీడియాలో ట్రోల్ అవుతోన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్కు తానే స్వయంగా అనుమతులిచ్చానని గడ్కరీ పేర్కొన్నారు. టీఆర్ఎస్పై గడ్కరీ పొగడ్తలతో బీజేపీలో రచ్చ మొదలయింది. గడ్కరీ స్పీచ్ను ఎవరు సిద్ధం చేశారంటూ కమలనాథులు ఆరా తీస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలోనూ ఇదే అంశంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఓవైపు బండి యాత్ర చేస్తుంటే.. మరోవైపు కేంద్రమంత్రులు టీఆర్ఎస్ను పొగడడమేంటని పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ప్రోద్బలంతో స్పీచ్ తయారు చేశారో అంటూ కమలనాథులు గుసగుసలాడుకుంటున్నారు.