7 జాతీయ రహదారులను ప్రారంభించిన గడ్కరి
ABN , First Publish Date - 2022-04-24T23:57:34+05:30 IST
మహారాష్ట్రలో 5,569 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏడు జాతీయ రాహదారులను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ప్రారంభించారు. శుక్రవారం ఔరంగాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ రోడ్లను ప్రారంభించారు...
ముంబై: మహారాష్ట్రలో 5,569 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏడు జాతీయ రాహదారులను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ప్రారంభించారు. శుక్రవారం ఔరంగాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఔరంగాబాద్ జిల్లా అభివృద్ధికి రవాణా వ్యవస్థ ఊతమిస్తుందని అన్నారు. అలాగే జిల్లాలో పర్యాటక రంగం మరింత అభవృద్ధికి కూడా ఇది తోడ్పుతుందని పేర్కొన్నారు. ‘‘నగరంలో ట్రాఫిక్ మరింత ఎక్కువగా పెరుగుతోంది. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ట్రాఫిక్తో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. శబ్ద కాలుష్యం, వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఔరంగాబాద్కు సులువుగా రావొచ్చు’’ అని గడ్కరీ అన్నారు.