బీటెక్ విద్యార్థినికి ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2020-07-17T10:22:37+05:30 IST
వింత వ్యాధితో బాధపడుతున్న పొల్ల పంచాయతీ గడికారెంకు చెందిన బీటెక్ విద్యార్థిని కొండగొర్రి అమిలిని ఆదుకోవడానికి దాతలు ముందుకొస్తున్నారు. ‘
వైద్యం కోసం కేజీహెచ్కు తరలింపు
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
సీతంపేట: వింత వ్యాధితో బాధపడుతున్న పొల్ల పంచాయతీ గడికారెంకు చెందిన బీటెక్ విద్యార్థిని కొండగొర్రి అమిలిని ఆదుకోవడానికి దాతలు ముందుకొస్తున్నారు. ‘వింత వ్యాధి బారిన విద్యా కుసుమం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల 14న కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు, దాతలు స్పందించారు. ఐటీడీఏ అధి కారులు చొరవ తీసుకొని అమిలిని మెరుగైన వైద్యం కోసం గురువారం కేజీహెచ్కు తరలించారు. అమరావతి సచివాలయంలో మౌలికవసతులు, పెట్టుబడుల విభాగంలో ఏఎస్వోగా పనిచేస్తున్న ఎస్.విష్ణుమూర్తి 10 వేల రూపాయలను పొల్ల సెక్ర టరీ ఎ.అప్పలస్వామి ద్వారా అమిలి కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు. మరికొంతమంది ఆమె అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారు.