మా పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు: గాదె వెంకటేశ్వరరావు
ABN , First Publish Date - 2021-03-02T17:11:28+05:30 IST
గుంటూరు: ఎన్నికలకు ముందే తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
గుంటూరు: ఎన్నికలకు ముందే తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకొంటున్న వైసీపీ జనసేన అభ్యర్థులపై తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ప్రచారం చేయకుండానే ఎవరూ గెలుస్తారో చూద్దామన్నారు. హోంమంత్రి ఇల్లు, తాడేపల్లి ప్యాలెస్తో పాటు ప్రతి ఒక్క వైసీపీ నేత ఇంటినీ ముట్టడిస్తామన్నారు.