బీజేపీ ఉత్తరాంధ్ర కమిటీ కన్వీనర్గా ‘గద్దె’
ABN , First Publish Date - 2021-07-24T05:07:50+05:30 IST
బీజేపీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్గా మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు నియమితులయ్యారు.
చీపురుపల్లి: బీజేపీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్గా మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు నియమితులయ్యారు. గతేడాది బీజేపీలో చేరిన ఆయన సేవల్ని గుర్తించిన పార్టీ ఈ పదవిని కట్టబెట్టింది. రాష్ట్రాన్ని మూడు జోన్లగా విభజించి ఉత్తరాంధ్ర అభి వృద్ధి కమిటీ కన్వీనర్గా, రాష్ట్ర కమిటీ ఆహ్వాన సభ్యునిగా బాబూరావును నియమించింది.