అమిత్ షా సభలో గద్దర్
ABN , First Publish Date - 2022-05-15T09:12:42+05:30 IST
తుక్కుగూడ బీజేపీ బహిరంగ సభలో ప్రజా యుద్ధనౌక గద్దర్ అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు.
శంషాబాద్ రూరల్/(ఆంధ్రజ్యోతి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి), మే 14 : తుక్కుగూడ బీజేపీ బహిరంగ సభలో ప్రజా యుద్ధనౌక గద్దర్ అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు. దాదాపు గంటసేపు ఆయన సభలో ఉన్నారు. కార్యక్రమం ముగిశాక ఎయిర్పోర్టులో అమిత్ షాను కలిసి వినతిపత్రం ఇచ్చారు.కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు ముఖ్యనేతలు ఆయనతో ఉన్నారు. ఇటీవల గద్దర్ టీఆర్ఎస్ ఆందోళనలో పాల్గొన్నారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. తాజాగా ఆయన అమిత్షాను కలిసి వినతి పత్రం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. గద్దర్పై వివిధ రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. దీంతో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమిత్షాను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిసింది.