-
-
Home » Andhra Pradesh » G Pulla Reddy Grandson Eknath Reddy Booked for Domestic Voilence Case-MRGS-AndhraPradesh
-
G Pulla Reddy Grandson: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై కేసు పెట్టిన భార్య.. ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2022-05-14T20:45:53+05:30 IST
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడు ఏక్నాథ్రెడ్డిపై గృహహింస కేసు నమోదైంది. తనను నిర్బంధించాడని పోలీసులకు అతని భార్య ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా..
హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడు ఏక్నాథ్రెడ్డిపై గృహహింస కేసు నమోదైంది. తనను నిర్బంధించాడని పోలీసులకు అతని భార్య ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా ఏక్నాథ్రెడ్డి దంపతుల మధ్య కలహాలు తలెత్తాయి. భార్యను ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా ఏక్నాథ్ అడ్డుకుంటున్నట్లుగా తెలిసింది. అంతేకాదు.. ఏకంగా రాత్రికి రాత్రే ఆమె ఉంటున్న గదికి అడ్డుగా గోడ నిర్మాణం చేసినట్లు సమాచారం. పోలీసులు ఏక్నాథ్పై వరకట్న వేధింపులు, గృహహింస కేసులు నమోదు చేశారు.
ఏక్నాథ్ రెడ్డి తండ్రి రాఘవరెడ్డి G Pulla Reddy Groupకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఏక్నాథ్రెడ్డి వివాహ రిసెప్షన్ మార్చి 2014లో అంగరంగ వైభవంగా హైదరాబాద్లోని జేఆర్ఎసీ కన్వెన్షన్లో జరిగింది. ఏక్నాథ్ రెడ్డి భార్య తండ్రి మైనింగ్ వ్యాపారం చేస్తుంటాడు. పేరున్న కుటుంబం కావడంతో జి.పుల్లారెడ్డి ఫ్యామిలీతో వియ్యం అందుకున్నారు. కానీ.. ఇలా కూతురిని తన అల్లుడు ఇబ్బంది పెడతాడని ఆయన ఊహించలేకపోయారు. పంజాగుట్ట పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు.