ఇక్కడ కనిపిస్తున్న చితిలో మూడు మృతదేహాలు.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-01-01T22:21:12+05:30 IST

వాళ్లు ముగ్గురు స్నేహితులు.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు..

ఇక్కడ కనిపిస్తున్న చితిలో మూడు మృతదేహాలు.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

వాళ్లు ముగ్గురు స్నేహితులు.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. కలిసి చదువుకున్నారు.. పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు.. ఇటీవల ముగ్గురూ ఒకే బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు.. దీంతో వారి స్నేహానికి గుర్తుగా ముగ్గురినీ ఒకే చితిపై ఉంచి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. రాజస్థాన్‌లోని నాగౌర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 


నాగౌర్ గ్రామానికి చెందిన చతురామ్, శివలాల్, సుశీల్ ముగ్గురూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకే కాలనీలో నివసించే ముగ్గురూ కలిసి చదువుకున్నారు. ఎప్పుడూ కలిసే తిరిగేవారు. గురువారం మధ్యాహ్నం ముగ్గురూ తమ గ్రామం నుంచి వేరే ఊరికి వెళ్లారు. సాయంత్రం స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా వారి బైక్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ముగ్గురునీ కుటుంబ సభ్యులు ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2022-01-01T22:21:12+05:30 IST