అనాథ శవానికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-10-20T05:18:54+05:30 IST

కడప నగరం ‘మేము సైతం’ సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రాజారెడ్డి వీధిలో నివాసం ఉంటున్న పుర్లకుంట వెంకటసుబ్బమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

అనాథ శవానికి అంత్యక్రియలు
మృతదేహానికి నివాళులర్పిస్తున్న సేవాసంస్థ సభ్యులు

కడప(ఎర్రముక్కపల్లె), అక్టోబరు 19: కడప నగరం ‘మేము సైతం’ సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రాజారెడ్డి వీధిలో నివాసం ఉంటున్న పుర్లకుంట వెంకటసుబ్బమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈమె అనారోగ్యంతో మృతిచెందింది. ఈమెకు కూతురు, మనవడు, బంధువులు ఉన్నా అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో సంస్థ సభ్యులు మేమున్నామంటూ ముందుకొచ్చి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేశారు. సంస్థ సభ్యులు రవి, అయ్యవారయ్య, ఆనంద్‌, రెడయ్య, రాజేష్‌, సురేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T05:18:54+05:30 IST