Tomorrow బొజ్జల ఊరందూరులో అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-05-08T01:49:15+05:30 IST

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పార్ధివ దేహానికి ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. బొజ్జల స్వగ్రామమైన శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో

Tomorrow బొజ్జల ఊరందూరులో అంత్యక్రియలు

తిరుపతి: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పార్ధివ దేహానికి ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. బొజ్జల స్వగ్రామమైన శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ఉదయం 11గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లను టీడీపీ సీనియర్‌ నేతలు పరిశీలించారు. కాగా అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. మరోవైపు తెలంగాణ, ఏపీల నుంచీ బొజ్జలకు సన్నిహితంగా మెలిగిన పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.


బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాదు జూబ్లీ హిల్స్‌ అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన పార్ధివదేహం శనివారం మధ్యాహ్నం స్వగ్రామమైన శ్రీకాళహస్తి మండలం ఊరందూరు చేరుకుంది. పార్ధివ దేహాన్ని కుటుంబీకులు హైదరాబాదు నుంచీ విమానంలో తిరుపతి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడనుంచీ వాహనంలో రోడ్డు మార్గాన శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయానికి తీసుకొచ్చి మధ్యాహ్నం ఒక గంట వరకూ ప్రజల సందర్శన కోసం వుంచారు. అనంతరం అక్కడ నుంచీ పట్టణ ప్రధాన వీధుల మీదుగా ఊరేగింపు సాగి మధ్యాహ్నం 2.20 గంటలకు స్వగ్రామమైన ఊరందూరుకు తరలించారు.బొజ్జల పార్ధివదేహాన్ని చూడగానే కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు భోరున విలపించడంతో గ్రామంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. 

Read more