భైంసా అభివృద్ధికి నిధులు కేటాయించాలి

ABN , First Publish Date - 2021-04-16T07:20:15+05:30 IST

మున్సిపల్‌ కేంద్రమైన భైంసాలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి, అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు గాను నిధులు కేటా యించాలని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మంత్రి కేటీఅర్‌కు విజ్ఞప్తి చేశారు.

భైంసా అభివృద్ధికి నిధులు కేటాయించాలి
మంత్రి కేటీఅర్‌కు వినతిపత్రం అందచేస్తున్న ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

భైంసా, ఏప్రిల్‌ 15 : మున్సిపల్‌ కేంద్రమైన భైంసాలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి, అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు గాను నిధులు కేటా యించాలని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మంత్రి కేటీఅర్‌కు విజ్ఞప్తి చేశారు. గురు వారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఅర్‌ను కలిసిన ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సంబంధిత విషయంలో వినతిపత్రం అందచేశారు. ఆయా వార్డుల పరిధిలో నెలకొని ఉన్న సమస్యలను వివరించారు. ఆయా ప్రాంతాల్లో అ వసరమైన అభివృద్ధి పనుల వివరాలను తెలిపారు. భైంసాను ఆదర్శ మున్సి పాలిటీగా తీర్చిదిద్దేందుకు గాను విరివిగా నిధులు కేటాయించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఅర్‌ ప్రాధా న్యతానుసారం సమస్యల పరిష్కారం, ప్రగతిపనుల కోసం నిధులు కేటాయిస్తా నని హామినిచ్చినట్లుగా ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి వెల్లడించారు. 


Updated Date - 2021-04-16T07:20:15+05:30 IST