రాజీనామా చేశాకే మునుగోడుకు నిధులు
ABN , First Publish Date - 2022-08-20T06:07:12+05:30 IST
తన రాజీనామాతోనే మునుగోడు నియోజ కవర్గానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
మునుగోడు, ఆగస్టు 19: తన రాజీనామాతోనే మునుగోడు నియోజ కవర్గానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల మధ్య అసమానతలను చూపుతూ తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానంగా తాను ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే కారణంతో మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడిన కేసీఆర్ ఇక్కడికి వచ్చే ముందు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ వంటి ప్రాంతాలు మాత్రమే కాదన్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించకుండా సీఎం పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎ్సను ఓడించి కేసీఆర్కు బుద్ధి చెప్పాలన్నారు. మాజీ ఎంపీలు వివేక్ వెంకట్స్వామి, రవీందర్నాయక్లు మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మించే ప్రాజెక్ట్లు అభివృద్ధికోసం కాదని, అవి కేవలం సీఎం కేసీఆర్ కుటుంబ అభివృద్ధి కోసమేనని అన్నారు. సమావేశంలో నాయకులు దోనూరి వీరారెడి, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివా్సరెడ్డి, పాల్వాయి గోవర్ధన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.