క్రీడలతో మానసికోల్లాసం
ABN , First Publish Date - 2022-01-27T05:02:34+05:30 IST
క్రీడలతో మానసికోల్లాసం
కొత్తూర్, జనవరి 26: క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యం పెంపొందుతుందని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యదేవేందర్యాదవ్ అన్నారు. తిమ్మాపూర్లో బుధవారం ఫ్రెండ్స్ యూత్ అధ్వర్యంలో వాలీబాల్, అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నిలను నిర్వహించారు. ఛైర్పర్సన్ విజేతలకు బహుమతులను అందజేశారు. వైస్చైర్మన్ డి.రవీందర్, కౌన్సిలర్లు శ్రీనివాస్, చంద్రకళరాజేందర్గౌడ్, ఎంపీటీసీ రాజేందర్గౌడ్ పాల్గొన్నారు.
- యువత క్రీడల్లో రాణించాలి
కడ్తాల్, జనవరి 26: క్రీడలు శారీర ధారుఢ్యానికి, మానసిక వి కాసానికి దోహదపడుతాయని కడ్తాల వైస్ ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్ అన్నారు. క్రీడాకారులకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వా లని కోరారు. పెద్దిరెడ్డి చెరువు తండాలో బుధవారం క్రికెట్ పోటీలను ఆనంద్ ప్రారంభించారు. ఉపసర్పంచ్ శ్రీను, గణేశ్, మధు, గిరి, మహేశ్, కుమకార్, శ్రీశైలం,వినయ్ పాల్గొన్నారు.