ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతు: ఏపీసీసీ

ABN , First Publish Date - 2022-01-25T08:45:00+05:30 IST

పీఆర్సీ సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టదలచిన సమ్మెకు సంపూర్ణ మద్దతను ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఏపీసీసీ) ప్రకటించింది.

ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతు: ఏపీసీసీ

పీఆర్సీ సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టదలచిన సమ్మెకు సంపూర్ణ మద్దతను ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఏపీసీసీ) ప్రకటించింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకూ వారికి అండగా ఉంటామని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ సోమవారం ఒక ప్రకటనలో ప్రకటించారు. పీఆర్సీ జీవోను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలన్నారు. ఉద్యోగులతో చర్చలు జరపకుండా తాడేపల్లి ప్యాలె్‌సలో కూర్చొని ముఖ్యమంత్రి జగన్‌ తమాషా చూస్తున్నారా? అని సాకే ప్రశ్నించారు.

Updated Date - 2022-01-25T08:45:00+05:30 IST