అమెరికాలో వింత సంఘటన.. రంగుమారిన జాబిల్లి

ABN , First Publish Date - 2021-07-26T02:41:12+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో వింత సంఘటన చోటు చేసుకుంది. పౌర్ణమి వేళ తెలుపు వర్ణంలో ఎంతో అందంగా ఉండాల్సిన జాబిల్లి రంగు అకస్మాత్తుగా మారిపోయింది. దీంతో అగ్రరాజ్యంలోని ప్రజలకు చందమామ నా

అమెరికాలో వింత సంఘటన.. రంగుమారిన జాబిల్లి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వింత సంఘటన చోటు చేసుకుంది. పౌర్ణమి వేళ తెలుపు వర్ణంలో ఎంతో అందంగా ఉండాల్సిన జాబిల్లి రంగు అకస్మాత్తుగా మారిపోయింది. దీంతో అగ్రరాజ్యంలోని ప్రజలకు చందమామ నారింజ రంగులో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఒరెగాన్, మోంటానా, ఐడహో, కాలిఫోర్నియా, నెవాడా రాష్ట్రాల్లో కార్చిచ్చు భీకర రూపం దాలుస్తోంది. దీంతో ఆకాశాన్ని దట్టమైన పొగ ఆవరించింది.  ఈ క్రమంలోనే వాషింగ్టన్ డీసీలోని ప్రజలకు శుక్రవారం సాయంత్రం జాబిల్లి నారింజ రంగులో దర్శనిమిచ్చింది. దీంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రజలు ఫొటోలు తీస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రంగుమారిన చందమామ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. 




Updated Date - 2021-07-26T02:41:12+05:30 IST