పీహెచ్సీల్లో పూర్తి స్థాయి వసతులు కల్పించాలి
ABN , First Publish Date - 2021-08-04T04:20:16+05:30 IST
జిల్లాలోని గ్రామీణ ప్రాం తాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయి వస తులు కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రవెల్లి రఘు నాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్షెట్టిపేట మండలం లోని వెంట్రావుపేట పీహెచ్సీని మంగళవారం సంద ర్శించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు వెర్రవెల్లి రఘునాథ్
లక్షెట్టిపేట రూరల్, ఆగస్టు 3: జిల్లాలోని గ్రామీణ ప్రాం తాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయి వస తులు కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రవెల్లి రఘు నాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్షెట్టిపేట మండలం లోని వెంట్రావుపేట పీహెచ్సీని మంగళవారం సంద ర్శించారు. పీహెచ్సీలో వైద్య పరీక్షలు, వసతుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టీకా, కొవిడ్ పరీక్షల కోసం వచ్చే రోగులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని కోరారు. మండల అధ్యక్షుడు కిషన్, నాయకులు స్వామి, వంశీ, రాజలింగు, సతీష్రావు, వెంకటకృష్ణ, మల్లికార్జున్, సాయి పాల్గొన్నారు.
కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం
హాజీపూర్: కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్రావు ఆర్థిక సహాయాన్ని అందచేశారు. ముల్కల్ల, ర్యాలీ, హాజీపూర్, దొనబండ గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి 10 వేల చొప్పున ఆర్థిక సహా యాన్ని అందించారు. బొలిశెట్టి తిరుపతి, మోలపలుకుల తిరుపతి, మధవరపు వెంకట రమణారావు, బియ్యాల సతీష్ రావు, మడిపెల్లి సత్యం, రాజేష్, నరేష్, సాయి నవీన్ తదితరులు ఉన్నారు.