పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చండి
ABN , First Publish Date - 2020-02-20T09:38:44+05:30 IST
నూరుశాతం ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేస్తామని సీఎం జగన్ పాదయాత్రలో
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఏబీవీపీ వినూత్న నిరసన
నెల్లూరు(వ్యవసాయం), ఫిబ్రవరి19 : నూరుశాతం ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేస్తామని సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జస్వంత్సింగ్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ నెల్లూరుశాఖ ఆధ్వర్యంలో వీఆర్సీ కూడలిలో మెడకు ఉరితాడు కట్టుకుని ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోసం వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసిందని కొత్ర ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క రూపాయికూడా విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల చదువు ఆగిపోయి, సర్టిఫికెట్లు రాక నిరుద్యోగులుగా మారుతున్నారన్నారు. బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శులు జయంత్ బాషా, జోనల్ ఇన్చార్జి సాయికృష్ణ, జయప్రకాష్, శివ, మహేష్, భాను, చందు తదితరులు పాల్గొన్నారు.