పక్కాగృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-08-09T04:13:40+05:30 IST

పక్కా గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఎంపీడీవో ప్రత్యూష కోరారు. ఆమె సోమవారం మండలంలోని దొరువులపాళెం, పంటపాళెం పంచాయతీల్లోని జగనన్న లేఅవుట్లను పరిశీలించారు.

పక్కాగృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

 ఎంపీడీవో ప్రత్యూష

ముత్తుకూరు, ఆగస్టు 8: పక్కా గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఎంపీడీవో ప్రత్యూష కోరారు. ఆమె సోమవారం మండలంలోని దొరువులపాళెం, పంటపాళెం పంచాయతీల్లోని జగనన్న లేఅవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులను కలసి మాట్లాడుతూ పక్కాగృహాల నిర్మాణాలను వేగవంత చేయాలన్నారు. నిర్మాణ సమయంలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని, నిర్మాణాల బిల్లులను సత్వరమే మంజూరు చేస్తుందన్నారు. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టని లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి, ఇళ్ల నిర్మాణం వేగంగా సాగేలా చూడాలని సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు సూచించారు. హౌసింగ్‌ ఏఈ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T04:13:40+05:30 IST