నేటీ నుంచి సీతాగోంది ఆత్రం వంశీయుల పెర్సాపేన్ ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-05-17T04:01:44+05:30 IST
మండలంలోని సీతాగోంది-పంగడి గ్రామాల్లో సీతాగోంది ఆత్రం వంశీయుల పెద్దదేవుడి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైస్ఎంపీపీ ఆత్రం ప్రకాష్ రాజా, పంగడి సర్పంచ్ ఆత్రంజాలీంషారాజా తెలి పారు. ఈనెల17న పెర్సాపెన్ ఉత్సవాలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు.
సిర్పూర్(యూ), మే 16: మండలంలోని సీతాగోంది-పంగడి గ్రామాల్లో సీతాగోంది ఆత్రం వంశీయుల పెద్దదేవుడి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైస్ఎంపీపీ ఆత్రం ప్రకాష్ రాజా, పంగడి సర్పంచ్ ఆత్రంజాలీంషారాజా తెలి పారు. ఈనెల17న పెర్సాపెన్ ఉత్సవాలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. 18న పెర్సా పెన్ ఊరేగింపుతోపాటు మహాపూజ ఉంటుంద న్నారు. 19న పెన్సోడ్సువాల్, అదే విధంగా శతీక్ దేవతలపూజ ఉంటుందన్నారు. 20న మసేమాల్ దేవుని మహాపూజ ఉంటుంద న్నారు. 21న ముగింపు కార్యక్రమం ఉంటుంద న్నారు. కార్యక్రమానికి ఉమ్మడిజిల్లాతో పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్, యవత్మల్, నాందేడ్ జిల్లాల నుంచి సీతా గోంది ఆత్రం వంశీయులు, ఆ దివాసీలు హాజ రవుతారన్నారు.