Uber Bike బుక్ చేశాడో వ్యక్తి.. నిమిషాల్లో బైక్‌పై వచ్చిన అమ్మాయిని చూసి షాక్.. ఆమె ఎవరో ఏమిటో తెలిసి..

ABN , First Publish Date - 2022-05-17T00:55:49+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎన్నో రంగాలు కరోనా కారణంగా కుదేలయ్యాయి.

Uber Bike బుక్ చేశాడో వ్యక్తి.. నిమిషాల్లో బైక్‌పై వచ్చిన అమ్మాయిని చూసి షాక్.. ఆమె ఎవరో ఏమిటో తెలిసి..

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎన్నో రంగాలు కరోనా కారణంగా కుదేలయ్యాయి. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలా ఉద్యోగం కోల్పోయిన ఓ కోల్‌కతా మహిళ బతుకు తెరువు కోసం ఉబర్ బైక్ డ్రైవర్‌గా మారింది. బైక్ నడుపుతూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తోంది. రణ్‌బీర్ భట్టాచార్య అనే వ్యక్తి గత వారం కోల్‌కతాలో వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ఉబర్ బైక్ బుక్ చేశాడు.


బైక్ వేసుకుని వచ్చిన మహిళను చూసి ఆశ్చర్యపోయాడు. రైడ్ సమయంలో ఆమె నుంచి వివరాలు సేకరించాడు. ఆ మహిళ పేరు మౌతుషి బసు. 30 ఏళ్ల వయసు కలిగిన ఆ మహిళ కరోనాకు ముందు పానసోనిక్ కంపెనీలో పని చేసింది. లాక్‌డౌన్ సమయంలో తన ఉద్యోగం కోల్పోయింది. ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసి చివరకు ఉబర్ బైక్ డ్రైవర్‌గా స్థిరపడింది. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉబర్ బైక్ డ్రైవర్‌గా మారడం తప్ప తనకు మరో దారి కనబడలేదని మౌతుషి చెప్పింది.


ఆమె కథను రణ్‌బీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆమె చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకుందని, వర్షం పడుతున్నా తన నుంచి ఆమె ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదని రణ్‌బీర్ చెప్పాడు. రణ్‌బీర్ ఫాలోవర్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు. 

Updated Date - 2022-05-17T00:55:49+05:30 IST