రేషన్ కార్డుల్లేని వారికి సీఎం శుభవార్త

ABN , First Publish Date - 2020-04-05T13:42:24+05:30 IST

రేషన్ కార్డుల్లేని వారికి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శుభవార్త వెల్లడించారు....

రేషన్ కార్డుల్లేని వారికి సీఎం శుభవార్త

న్యూఢిల్లీ : రేషన్ కార్డుల్లేని వారికి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శుభవార్త వెల్లడించారు. కరోనా లాక్‌డౌన్ సందర్భంగా ఢిల్లీలో రేషన్ కార్డు లేని వారికి కూడా చౌకధరల దుకాణాల ద్వార ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో 71 లక్షలమంది రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఏడున్నర కిలోల బియ్యం చొప్పున ఉచితంగా పంపిణీ చేశామని సీఎం చెప్పారు.


ఢిల్లీలో చాలామంది ప్రజలకు రేషన్ కార్డులు లేవని, మరో 6.5లక్షల మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, పేదలైన వారికి కూడా రేషన్ కార్డులు లేకున్నా ఉచితంగా రేషన్ అందించాలని నిర్ణయించినట్లు సీఎం పేర్కొన్నారు. దీనికోసం రేషన్ కార్డుల్లేని వారు తమ పేర్లను ప్రత్యేక వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని సీఎం కోరారు. డిల్లీలోని పునరావాస కేంద్రాల్లో 10లక్షల మందికి ప్రభుత్వమే భోజనం అందిస్తుందని సీఎం చెప్పారు. ఒక్కరోజులోనే 50వేల మది రేషన్ కార్డుల్లేనివారు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వారందరికీ ఒక్కొక్కరికి 5కిలోల చొప్పున రేషన్ సరకులు ఉచితంగా అందిస్తామని సీం కేజ్రీవాల్ వివరించారు.

Updated Date - 2020-04-05T13:42:24+05:30 IST