25న గండి క్షేత్రం నుంచి హనుమాన్ శోభాయాత్ర
ABN , First Publish Date - 2022-05-23T05:05:54+05:30 IST
హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా 25 న గండి క్షేత్రం నుంచి హనుమాన్ శోభాయా త్ర నిర్వహిస్తున్నట్లు వేంకటేశ్వర, రాచరాయ ఆలయ అభివృద్ధి కమి టీ పిలుపునిచ్చింది.
చక్రాయపేట, మే 22: హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా 25 న గండి క్షేత్రం నుంచి హనుమాన్ శోభాయా త్ర నిర్వహిస్తున్నట్లు వేంకటేశ్వర, రాచరాయ ఆలయ అభివృద్ధి కమి టీ పిలుపునిచ్చింది. ఆలయ కమిటీ చైర్మన్ తంగెడుపల్లె ఓబుళరెడ్డి ఆధ్వర్యంలో 25న ఉదయం 7గంటలకు గండి క్షేత్రంలో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. శోభాయాత్రను మండలంలోని హిందూ సోదరులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అద్దాలమర్రి, కుమార్లకాల్వ, చెరుకాంపల్లె, ఎరబొమనపల్లె, కె రాజుపల్లె, కుప్పం, గంగారపువాండ్లపల్లె, మహదేవపల్లె, సురభి, చిలేకాంపల్లె గ్రామాల మీదుగా కొనసాగి మధ్యాహ్నం చక్రాయపేట మండల కేంద్రం వేంకటేశ్వర, రాచరాయ దేవస్థానం చేరుకుంటుందన్నారు.
అక్కడ అన్నదానం చేపడతారన్నారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, ఆల య మాజీ చైర్మన్లు లాయర్ రామాంజులరెడ్డి, చక్రపాణిరెడ్డి, హరినాథరెడ్డి, వైస్ చైర్మన్ ఈశ్వరయ్య, సభ్యులు రంగారెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు, ఈశ్వరయ్య, నాగభూషణం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.