క్రీడాపోటీలతో స్నేహపూర్వక వాతావరణం
ABN , First Publish Date - 2021-01-16T05:29:40+05:30 IST
క్రీడా పోటీలతో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని లక్కిరెడ్డిపల్లె మాజీ జడ్పీటీసీ సుదర్శన్రెడ్డి, సింగిల్విండో ప్రెసిడెంట్ యర్రంరెడ్డిలు అన్నారు.
లక్కిరెడ్డిపల్లె, జనవరి 15: క్రీడా పోటీలతో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని లక్కిరెడ్డిపల్లె మాజీ జడ్పీటీసీ సుదర్శన్రెడ్డి, సింగిల్విండో ప్రెసిడెంట్ యర్రంరెడ్డిలు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన వైఎ్సఆర్ క్రికెట్ టోర్నమెంట్లో బీ.యర్రగుడి గ్రామం చెంచర్లపల్లె జట్టు టోర్నమెంట్ విజేతగా నిలిచింది. రన్నర్స్గా కోనంపేట జట్లు నిలిచాయి. మొదటి బహుమతి సాధించిన జట్టుకు రూ.10,116, రెండో బహుమతి రూ.5,116లను మాజీ జడ్పీటీసీ సుదర్శన్రెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు యర్రంరెడ్డి అందజేశారు. మాజీ ఎంపీటీసీ సయ్యద్ అమీర్, గంగమ్మ ఆలయ మాజీ చైర్మెన్ వెంకటనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.