అత్యాచారానికి గురైన బాలిక ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం రాసిందో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-03-20T17:16:44+05:30 IST

ఆ బాలిక వయసు 17 ఏళ్లు. తన పక్కింట్లో ఉండే వ్యక్తితో స్నేహంగా ఉండేది. ఇటీవల ఆ బాలికను యువకుడు ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు.

అత్యాచారానికి గురైన బాలిక ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం రాసిందో తెలిస్తే షాక్!

ఆ బాలిక వయసు 17 ఏళ్లు. తన పక్కింట్లో ఉండే వ్యక్తితో స్నేహంగా ఉండేది. ఇటీవల ఆ బాలికను యువకుడు ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. రూమ్‌లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి తిరిగి వెళ్లిన బాలిక తీవ్ర ఒత్తిడికి గురైంది. అత్యాచార ఘటన తీవ్ర వేదన కలిగించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్‌లో నిందితుడిని క్షమించమని రాయడం కుటుంబ సభ్యులకు షాకిచ్చింది. 


రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని ఓ గ్రామంలో నివసిస్తున్న 17 ఏళ్ల బాలిక తన పక్కింట్లో ఉండే యువకుడితో చాలా కాలంగా స్నేహంగా ఉంటోంది. ఇద్దరూ తరచుగా బయటకు వెళ్లేవారు. పది రోజుల కిందట ఆమెను ఆ యువకుడు ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. హోటల్ రూమ్‌లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఇంటికి తిరిగి వెళ్లి ముభావంగా ఉండేది. నమ్మిన స్నేహితుడు అలా చేయడాన్ని తట్టుకోలేకపోయింది. 


తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీంతో బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది. అందులో తన స్నేహితుడు, నిందితుడిని క్షమించమని బాధితురాలు రాయడం కుటుంబ సభ్యులకు షాక్ కలిగించింది. 

Updated Date - 2022-03-20T17:16:44+05:30 IST