మిజోరాంలో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-28T01:30:32+05:30 IST

మిజోరాంలో పెరిగిన కరోనా కేసులు

మిజోరాంలో పెరిగిన కరోనా కేసులు

ఐజాల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రోజు రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. మిజోరాం రాష్ట్రంలో మొత్తం 1,865 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిజోరాంలో 12 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందితో సహా 30 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో కాంటాక్ట్ ట్రేసింగ్ సమయంలో 6 సంవత్సరాల బాలికతో సహా 13 మంది కొత్త రోగులు ఈ వ్యాధితో బాధపడుతున్నారని ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. కరోనా నమూనా సేకరణలో నిమగ్నమైన ఒక ఆరోగ్య కార్యకర్త కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు.

Updated Date - 2020-09-28T01:30:32+05:30 IST