అవకాశం ఉన్న ప్రతీచోట ఫ్రీడం పార్కులు

ABN , First Publish Date - 2022-08-11T05:23:47+05:30 IST

అవకాశం ఉన్న ప్రతీ చోట ఫ్రీడం పార్కుల నిర్మాణం చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

అవకాశం ఉన్న ప్రతీచోట ఫ్రీడం పార్కులు
లక్ష్మికుంటలో మొక్కలు నాటుతున్న మంత్రి, కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌

- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 


వనపర్తి అర్బన్‌, ఆగస్టు 10: అవకాశం ఉన్న ప్రతీ చోట ఫ్రీడం పార్కుల నిర్మాణం చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బు ధవారం భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా వనపర్తి లక్ష్మికుంట వద్ద ఫ్రీడం పార్క్‌లో జడ్పీ చైర్మ న్‌ లోక్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషాతో క లిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన స్వా తంత్య్ర వజ్రోత్సవాల్లో ప్రజలు భాగస్వాములై విజ యవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  

గోపాల్‌పేట : మండలంలోని బుద్దారం గురు కుల సాంఘిక సంక్షేమ విద్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన పాఠశాల పరిసరాల్లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఎంపీపీ సం ధ్య, జడ్పీటీసీ సభ్యురాలు భార్గవి, సర్పంచ్‌ పద్మమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి, పార్టీ మండల అధ్యక్షు డు గాజుల కోదండం, నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-11T05:23:47+05:30 IST