అమరుల త్యాగాల వల్లే స్వాతంత్య్రం

ABN , First Publish Date - 2022-08-15T05:38:25+05:30 IST

అమరుల త్యాగాల వల్లే స్వాతంత్య్రం

అమరుల త్యాగాల వల్లే స్వాతంత్య్రం
జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తున్న వెంకయ్యనాయుడు

  • మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

శంషాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): అమరవీరుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్టులో ఆదివారం నిర్వహించిన వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అమరవీరుల త్యాగాలను నేటి తరానికి తెలిసేలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అభివృద్ధి కోసం అధికార, ప్రతిపక్షాలు కలసి పనిచేయాలన్నారు. దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. సామాజికంగా మహిళలూ సామాన ప్రగతి సాధించేలా వారికి అవకాశాలు  కల్పించాలన్నారు. పట్టణాల్లో ఉన్న సౌకర్యాలను పల్లెల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చూపిన చొరవ దేశవ్యాప్తంగా జాతీయవాద స్ఫూర్తిని ఇనుమడింపజేసిందన్నారు. కార్యక్రమంలో స్వర్ణభారత్‌ ట్రస్టు చైర్మన్‌ కామినేని శ్రీనివాస్‌, హైదరాబాద్‌ చాప్టర్‌ కార్యదర్శి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T05:38:25+05:30 IST